త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటినుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుంది.దీనిలో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో బీజేపీ చీఫ్ బండి సంజయ్, తరుణ్ చుగ్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు సంస్థాగత నిర్మాణంపై చర్చించారు.అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే వారి పేర్లు నియోజకవర్గాల వారీగా సేకరించనున్నారు.
వారి బలాబలాలను బట్టి రాష్ట్ర నాయకత్వం పని విభజన చేయనుంది.దీని ఆధారంగా నియోజకవర్గాలకు బండి సంజయ్ త్వరలోనే కమిటీలను వేయనున్నారని తెలుస్తోంది.