పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల కు సిద్ధమైంది.ఈ నెల 25 వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించి అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి.
గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు పూర్తి అయిందని అభిమానులు చాలా సంతోషం గా ఉన్నారు.కానీ విశ్వసనీయం గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.
ఆగ మేఘాల మీద గ్రాఫిక్స్ వర్క్ లో చేస్తున్నట్లు గా సదరు కంపెనీ వర్గాల వారు తెలియ జేస్తున్నారు.గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకున్నా కూడా అనుకున్న టైం కి అంటే ఫిబ్రవరి 25 వ తారీఖు న ఈ సినిమా విడుదల కావడం మాత్రం పక్కా.
కొన్ని సినిమాల కు గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకుండానే విడుదల చేయడం మనం చూస్తూనే ఉంటాం.గ్రాఫిక్స్ అనేది సినిమా మరింత అందం గా కనిపించడం కోసం మాత్రమే.
కనుక గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కానంత మాత్రాన ఈ సినిమా ను విడుదల చేయడం ఆపి వేస్తారు అనుకోవడానికి లేదు.భీమ్లా నాయక్ సినిమా అంచనాలను మించి ఉంటుందని అభిమానులు చాలా నమ్మకం తో ఉన్నారు.
సాగర్ కె చంద్ర దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కు త్రివిక్రమ్ రచన సహకారాన్ని అందించారు.నాగ వంశీ ఈ సినిమా ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించాడు.పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో ఈ సినిమా వంద కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది.150 కోట్ల వసూళ్ల లక్ష్యం తో రాబోతున్న ఈ సినిమా ఎంతటి వసూళ్ల ను సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.