సుశాంత్ సినిమాపై కోర్టుకి ఎక్కిన తండ్రి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అతని మరణం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

 Sushant Singh Rajput's Father Moved Delhi High Court, Bollywood, Bollywood Celeb-TeluguStop.com

చేతినిండా సినిమాలు ఉండి కూడా ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది.అయితే సుశాంత్ కేవలం మానసికపరమైన సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తేల్చేశారు.

వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేశారు.అయితే ఈ కేసులో సీబీఐ ఎంక్వయిరీ స్టార్ట్ అవడంతో డ్రగ్స్ కోణం బయటపడింది.

సుశాంత్ డ్రగ్స్ ఎక్కువగా తీసుకునేవాడనే విషయం బయటపడింది.అతనికి ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేసేదని కన్ఫర్మ్ కావడంతో అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ భామ బెయిల్ మీద బయట ఉంది.

ఈ డ్రగ్స్ కేసుకి సంబందించిన విచారణ జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో కొంత మంది సుశాంత్ జీవిత కథతో సినిమా చేయాలని భావిస్తున్నారు.ఆర్జీవీ కూడా సుశాంత్ జీవితంలో ఉన్న అన్ని కోణాలని తెరపై సినిమా రూపంలో ఆవిష్కరించాలని అనుకుంటున్నారు.

అయితే దీనిపై సుశాంత్ తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.మా అబ్బాయి వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా తీసి దయచేసి మళ్ళీ చంపకండి అని కోరుతున్నారు.

మీ ప్రయత్నాలు ఆపకపోతే కోర్టుకి వెళ్లి తేల్చుకుంటా అని స్పష్టం చేశారు.కొడుకు పోయిన దుఖంలో ఉన్న తమకి ఇంకా పాతగాయాన్ని గుర్తుచేస్తూ మానసిక క్షోభకి గురిచేయోద్దని సుశాంత్ తండ్రి అభ్యర్దించుకుంటున్నారు.

అయితే వర్మ మాత్రం ఇప్పటికే సుశాంత్ లైఫ్ స్టొరీపై సినిమా స్టార్ట్ చేసేసినట్లు తెలుస్తుంది.మరి కోర్టులలో కేసులు గురించి పెద్దగా లెక్క చేయని ఆర్జీవీ సుశాంత్ తండ్రి అభ్యర్ధనని ఎంత వరకు పట్టించుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube