1.పట్టాభి భార్య హౌస్ అరెస్ట్

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి భార్య చందనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు .
2.మధుర గురుకుల ప్రిన్సిపాల్ పై వేటు
భోజనం బాగా లేదన్న పదో తరగతి విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన మధిర లోని జ్యోతిబాపూలే బిసి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నసిమా ను సస్పెండ్ చేస్తూ ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.
3.తారకరత్న మృతి పై బుచ్చయ్య కామెంట్స్

మానవత్వం లేని వైసిపి పశువులు తారకరత్న మృతి పైనా ఆరోపణలు చేస్తున్నాయని రాజమండ్రి టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
4.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 23వ రోజు మంగళవారం శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైంది.
5.జగన్ పై ఉమా కామెంట్స్

పులివెందుల అరాచకాన్ని సంస్కృతిని దౌర్జన్యాలను కృష్ణాజిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని , మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు.
6.చలో గన్నవరం కు టిడిపి పిలుపు
టిడిపి కార్యాలయం విధ్వంసానికి నిరసనగా చలో గన్నవరం కార్యక్రమానికి తెలుగుదేశం అధిష్టానం పిలుపునిచ్చింది.
7.గన్నవరం వ్యవహారంపై డీజీపీ కి చంద్రబాబు లేఖ

గన్నవరంలో టిడిపి శ్రేణులపై దాడులు హింసాత్మక ఘటనలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డీజీపీ కి లేఖ రాశారు.
8.టిడిపి కార్యాలయం పై దాడిని ఖండించిన సిపిఐ
గన్నవరంలో టిడిపి కార్యాలయం వైసీపీ కి చెందిన కొంతమంది దాడి చేసి ధ్వంసం చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు.
9.రేవంత్ రెడ్డి కామెంట్స్

భూ కబ్జాదారుడు , రౌడీ కార్యక్రమాలకు సూత్రధారి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
10.రాయలసీమపై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాయలసీమ సుడిగుండంలో ఇరుక్కుపోయింది అని రాయలసీమ ప్రాంతం వెంటీలేటర్ మీద ఉందని రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
11.ఏపీ గవర్నర్ కు ఘనంగా వీడ్కోలు

ఏపీ నుంచి బదిలీ అయిన గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ కు ఏపీ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ భిస్వ భూషణ్ హరి చందన్ పనితీరును ప్రశంసించారు.
12.జగన్ పై కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్
వైసీపీ పాలన రక్తం మరిగిన పులి పాలనలో ఉందని గన్నవరం వ్యవహారంపై మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
13.సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యం

ఏపీలో సామాజిక న్యాయం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు.
14.నేటి నుంచి యాదాద్రి ఆలయ వార్షికోత్సవాలు
నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభం కానున్నాయి.
15.వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్

అనంతపురంలో ఈ నెల 22న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం జరగనుంది .ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కానున్నారు.
16.ఏపీసీసీ అధ్యక్షుడి సమావేశం
నెల్లూరులోని ఇందిరా భవన్ లో హగ్ జోడో అభియాన్ పై నేతలతో పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు సమావేశం నిర్వహించారు.
17.యానంలో వెంకన్న కళ్యాణోత్సవాలు
నేటి నుంచి యానంలో మీసాల వెంకన్న కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి.
18.గన్నవరం పిఎస్ కు పట్టాభి

కృష్ణాజిల్లా గన్నవరం లో జరిగిన ఘటనల నేపథ్యంలో అరెస్ట్ చేసిన టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు .ఆయనకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు.
19.శంషాబాద్ కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రులు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ , ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రులను కేంద్ర కార్మిక శాఖ మంజూరు చేసింది.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,000
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 56,730
.