పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా ఇటీవల జరిగిన నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొనలేదు.ఆమె ఇద్దరు పిల్లలు మరియు ఆమె ఎటు వెళ్లారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
కొన్ని మీడియా సంస్థలు ఏకంగా పవన్ ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు అంటూ ప్రచారం చేశారు.ఆమె రష్యా వెళ్లి పోయి చాలా నెలలు అయ్యిందని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో అన్నా లెజ్నోవా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో పుకార్లకు చెక్ పడ్డట్లయ్యింది.పవన్ నుండి ఆమె విడిపోలేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.
ఈ సమయంలోనే మరో ప్రచారం మొదలైంది.డిసెంబర్ లో క్రిస్మస్ వేడుకల కోసం అన్నా రష్యాకు వెళ్లడం పరిపాటిగా వస్తుంది.
ఆమె ఈసారి కూడా అక్కడకు వెళ్లింది.కాని అక్కడ క్రిస్మస్ వరకు ఉండక పోవడం పై చర్చ మొదలైంది.
క్రిస్మస్ కారణంగా ఆమె ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటుందని అంతా అనుకున్నారు.అందుకే నిహారిక పెళ్లికి రాలేదు అన్నారు.
కాని అన్నా తన ఇద్దరు పిల్లలతో క్రిస్మస్ కు ముందే తిరిగి రావడం ఏంటా అంటున్నారు.
ఆ విషయం పక్కన పెడితే ఎయిర్ పోర్ట్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పొలెనా అంజనా మరియు తనయుడు మార్క్ శంకర్ పవనోవా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
వారిద్దరు కూడా చూస్తుండగానే పెద్ద వారు అయ్యారు.పవన్ కూతురు పొలెనా అచ్చు గుద్దినట్లుగా పవన్ బాడీలాంగ్వేజ్ ను కలిగి ఉన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక పవన్ తనయుడు మార్క్ శంకర్ కూడా భలే గా పవన్ ఉన్నట్లుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు మరియు మూడవ భార్య అన్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
వీరు క్రిస్మస్ ముందు ఇండియాకు తిరిగి రావడం వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉందా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.మరి కొందరు మాత్రం పవన్ ఇద్దరు పిల్లలను చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.