ఉప్పు.మానవ శరీరానికి ఖచ్చితంగా కావాల్సిన లవణం.శరీర జీవక్రియలు సమర్ధంగా పని చేయాలంటే ఉప్పు తీసుకోవాలి.అయితే ఉప్పును వాడితే.అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని చాలా మంది నమ్ముతారు.అది నిజమే.
కానీ, అతిగా తీసుకున్నప్పుడే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.మితంగా తీసుకుంటే.
అంటే శరీరంలో నీరు, ఉప్పు ఈ రెండిటి సమతౌల్యం సమంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
ఇక ముఖ్యంగా ఉప్పు నీరుతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అవేంటో ఓ లుక్కేసేయండి.ఇటీవల రక్తపోటు తో చాలా మంది బాధ పడుతున్నారు.
రక్తపోటును అదుపు చేయాలంటే సోడియం కావాలి.అందుకే ఉప్పు నీరు తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది.
అయితే ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు.చాలా మితంగా మాత్రమే ఉప్పు నీరు తీసుకోవాలి.
అలాగే ఉప్పు నీరు తాగడం వల్ల పొట్ట, పేగులు, పెద్ద పేగు వంటివి శుభ్రం అవుతాయి.కడుపు నొప్పితో బాధపడేవారు కొద్దిగా ఉప్పు నీరు తీసుకుంటే.తక్షణ ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడేవారు.ఉప్పు నీటితో ముక్కు లోపల శుభ్రం చేసుకోవడం, గొంతులో ఆ నీరు పోసుకుని పుక్కిలించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఉప్పు నీరు ఎంతో గ్రేట్గా సహాయపడుతుంది.
అందుకే ప్రతిరోజు ఉప్పు నీరు నోట్లు పోసుకుని పుక్కిలిస్తే.బ్యాక్టీరియా, గొంతు బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
మరియు నోటి దుర్వాసన కూడా తగ్గుముఖం పడుతుంది.