కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీల సమస్యలు తీరుస్తాం

రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ పార్టీ( Congress party ) రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఎల్లారెడ్డిపేటలోని మైనార్టీల కోసం ఈద్గా నిర్మించడం అసంపూర్తిగా ఉన్నటువంటి షాది ఖానా భవనాన్ని, సకలహంగులతో వినియోగంలోకి తీసుకువస్తామని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు బాలరాజు యాద( Oggu Balaraju )వ్ అన్నారు.సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు యాదవ్ మాట్లాడుతూ తాను ఎంపీటీసీగా కొనసాగుతున్న హయాంలోనే మైనార్టీల కోసం ఒక బోర్ కూడా వేయడం జరిగిందని అన్నారు.

 When The Congress Party Comes To Power, We Will Solve The Problems Of The Minori-TeluguStop.com

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేస్తామని మైనార్టీలకు భరోసనిస్తున్నట్లు బాలరాజు యాదవ్ అన్నారు.

మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మైనార్టీ రిజర్వేషన్ 12% ఏమైందని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీయంలో గల మూడో నెంబర్ పై చేతి గుర్తుపై ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డి( kk mahender reddy )ని గెలిపించాలని ఆయన మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కావటి మహేష్ యాదవ్ పై బిఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని అఖిల భారత యాదవ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మైనార్టీ నాయకులు రఫిక్, జహంగీర్, హారుణ్ కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, బుచ్చి లింగు సంతోష్ గౌడ్, దీటి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube