బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి ప్రతినిధుల సమావేశం ( ప్లీనరీ ) ని విజయవంతం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా : బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి ప్రతినిధుల సమావేశం ( ప్లీనరీ ) లో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి కోరారు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సిరిసిల్ల బైపాస్ రోడ్ ప్రక్కన గల ఆపేరల్ పార్క్ దగ్గర బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ తేదీ 25-04-2023 మంగళవారం ఉదయం 9-00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5-00 గంటల వరకు కొనసాగుతుందనిఈ ప్లీనరీ లో పాల్గొననున్న 5000 మందికి భోజన వసతులు కల్పిస్తారని ఆయన తెలిపారు.

 Make The Brs Party Sirisilla Constituency Level Representative Meeting (plenary)-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం, మండల ఉపాధ్యక్షులు కొలకాని శంకర్ , శ్రీనివాస్, సీనియర్ నాయకులు మేగి నరసయ్య , ఎలగందుల నర్సింలు , బందారపు బాల్ రెడ్డి , జవ్వాజీ రామస్వామి , లద్దునూరి తిరుపతి యాదవ్ , మహమ్మద్ అఫ్జల్ బాయ్, ధర్వేష్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube