రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ ఆటో డ్రైవర్ల తో సమావేశం నిర్వహించి,కౌన్సిలింగ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోలను రోడ్డలపై నిలుపరాదు అని, ప్రతి ఆటోడ్రైవర్ యూనిఫాం వేసుకోవాలి అని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అనీ ఆటో పత్రాలు కలిగి ఉండాలి అని, అనవసరమైన సౌండ్ సిస్టమ్ ఉండకూడదు అని, రాంగ్ రూట్ లో ఆటోలను నడపరాదు అని,ఆటోలలో అధిక ప్యాసింజర్ లను ఎక్కించుకోవద్దు అని,
ఆటోకు వెనుకవైపు ఓపెన్ చేసి ఉండరాదు అని, ఆటోలను ప్రమాదకరంగా నడపరాదు అని,మైనర్ లు ఆటో డ్రైవింగ్ చేయరాదు అన్నారు.ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో పెద్దలింగాపురం సర్పంచ్ జి.జితేందర్ గౌడ్, ఉపసర్పంచ్ కుమార్ యాదవ్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ లు లక్ష్మీనారాయణ,జీవన్,మండలంలోని ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.







