తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లనున్నారు.బెంగళూరులో జరిగే కర్ణాటక సీఎల్పీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపు సాధించిన విషయం తెలిసిందే.అయితే సీఎం అభ్యర్థిగా ఎవరు నిలుస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పోటీ నెలకొంది.కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
తాజా వార్తలు