1.ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి బీఎస్పీ మద్దతు
రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగుతున్న ద్రౌపతి ముర్ము కు బీఎస్పీ మద్దతు ప్రకటించింది.
2.ఇది కూల్చివేతల ప్రభుత్వం : చంద్రబాబు
ఇది కూల్చివేతలో ప్రభుత్వం అంటూ వైసీపీ ప్రభుత్వం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు.
3.వైద్య ఆరోగ్యశాఖలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ
ఏపీలోని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ వైద్య విధాన పరిషత్ లో పలు ఒప్పంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కానుంది.
4.ఆవుల సుబ్బారావు కు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్ని పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్ విధించింది.
5.కాఫీ లను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి : వర్ల
పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టిడిపి సీనియర్ లీడర్ వర్ల రామయ్య లేఖ రాశారు.
6.బిజెపి ముఖ్యనేతలతో తరుణ్ చుగ్ సమావేశం
తెలంగాణ బిజెపి కార్యాలయం లో ముఖ్య నేతలతో ఆ పార్టీ రీఛార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు సమావేశమయ్యారు.
7.జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘం ధర్నా
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది.
8.తపాలా శాఖ ద్వారా ‘బోనం సేవలు ‘
ఆషాఢ బోనాలు వేడుకల సందర్భంగా అమ్మవారి సేవలో నేరుగా పాల్గొనలేని భక్తులకు తపాలాశాఖ అవకాశం కల్పించింది.నిర్ణీత రుసుము చెల్లిస్తే ఆలయాల్లో కోరుకున్న రోజున భక్తుల పేర్లతో పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తపాలా శాఖ అధికారులు తెలిపారు.
9.తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి సగటున 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
10.దేవినేని ఉమ పాదయాత్ర
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నేత మాజీ మంత్రి దేనిని ఉమామహేశ్వర రావు జి.కొండూరు మండలంలో పాదయాత్ర చేపట్టారు.రాష్ట్రంలో రహదారులు దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేందుకు దుగ్గిరాలపాడు గ్రామం నుంచి జి.కొండూరు వరకు పాదయాత్ర ప్రారంభించారు.
11.ఏపీ డీజీపీకి చంద్రబాబు
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత ను పోలీసుల వాహనం ఎక్కించడం , హత్య కేసులో సాక్షులను పోలీసులే బెదిరించడం పై డీజేపీ కి లేఖ రాశారు.
12.ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఎలుగుబంటి భయం
ప్రకాశం జిల్లాలో ఎలుగుబంటి టెన్షన్ కొనసాగుతోంది.కొమరోలు మండలం తాడిచర్ల వద్ద ఐదు రోజుల నుంచి ఎలుగుబంటి సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గుగురవుతున్నారు.
13.విశాఖలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం
బిజెపి రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ సమావేశం విశాఖలో జరిగింది బిజెపి ఏపీ అధ్యక్షుడు ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్సీ టి వి ఎస్ మాధవ్ తదితరులు హాజరయ్యారు.
14.నిజాంసాగర్ ఆయకట్టు నీరు విడుదల
నిజాంసాగర్ ఆయకట్టుకు నీటిని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు.
15.దూళిపాళ్ల ట్రస్ట్ కి ప్రభుత్వం నోటీసులు
దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు కి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.ప్రస్తుత ఎందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది .
16.తెలంగాణ కు జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ కు రానున్నారు.
17.పుట్టపర్తి ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య
పుట్టపర్తి ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ (51) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
18.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,550 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,870
.