ఓ యువకుడు పొట్టకూటి కోసం వేరే ప్రాంతానికి వెళ్లి ఓ చోట పనిలో చేరాడు.ఆరు నెలలు గడిచిన ఆ ఓనర్ ( Owner ) జీతం మాత్రం ఇవ్వకుండా మభ్యపెడుతూ వచ్చాడు.
చివరకు విసిగిపోయిన యువకుడు గట్టిగా ప్రశ్నించిన కూడా ఓనర్ జీతం( Salary ) ఇవ్వకపొగా ఆ యువకున్ని అతి దారుణంగా అవమానించాడు.దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
వివరాల్లోకెళితే పొట్టకూటి కోసం ముంబై నగరంలోని( Mumbai ) దాదార్ ప్రాంతంనికి చాలా సంవత్సరాల కిందట రామ్ రాజ్ జైస్వార్ అనే వ్యక్తి కుటుంబం వలస వచ్చింది.
రామ్ రాజ్ జైస్వార్ స్థానికంగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు.అయితే రామ్ రాజ్ జైస్వార్ భార్య చాలా రోజుల క్రితం చనిపోయింది.వీరికి 18 ఏళ్ల పంకాజ్ సంతానం.
పదవ తరగతి వరకు చదివిన పంకాజ్ కూలీ పనులకు వెళ్లేవాడు.అయితే గత ఆరు నెలల కిందట ఓ కిరాణా షాపులో పనికి కుదిరి, చాలా నమ్మకంగా పనిచేశాడు.
ఎన్ని సార్లు అడిగినా ఓనర్ జీతం ఇవ్వకపోవడంతో ఆ షాపులో పని మానేసి మరొకచోట పనిలో చేరాడు.
అక్కడ కూడా నెల రోజులు గడిచిన తర్వాత జీతం ఇవ్వడానికి ఆ ఓనర్ కూడా నిరాకరించడంతో.తాను చేసిన పనికి జీతం ఇవ్వాలని ఇద్దరు ఓనర్లను గట్టిగా ప్రశ్నించాడు.దీంతో ఆ ఇద్దరు ఓనర్లు పంకాజ్ ను గుండు కొట్టించి, రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు.
ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోయినా పంకాజ్ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.పంకాజ్ తండ్రి రామ్ రాజ్ జైస్వార్ తన కొడుకుకు జరిగిన అవమానం, ఆత్మహత్య గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.