రాజమండ్రిలోని( Rajahmundry ) వేమగిరిలో నిర్వహించిన బీజేపీ ప్రజాగళం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) పాల్గొన్నారు.ఏపీలో మే 13న కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని తెలిపారు.
ఏపీలో ఎన్డీఏ సర్కార్( NDA Govt ) రాబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) కూడా ఎన్డీఏ విజయం సాధించబోతోందని తెలిపారు.
ఈ క్రమంలోనే వికసిత భారత్ లో వికసిత ఏపీ అంతర్భాగం కాబోతుందని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పరాభవాన్ని అంగీకరించిందన్నారు.అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ అని చెప్పారు.డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.