మన తెలుగు టెలివిజన్ రంగంలోకి చాలా మంది యాంకర్స్ ని మనం ఇప్పటి దాకా చూసే ఉంటాము.అయితే ఇప్పటిదాకా మనం ఎంతో మంది యాంకర్స్ ని చూసే ఉంటాము.
కానీ వాళ్లలో కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాము.ఎందుకంటే ఆ కొంతమంది యాంకర్స్ బాగా పాపులర్ అవ్వడం వలనే వాళ్లు మనకి సుపరిచితులు అయ్యారు.
అయితే మన అందరికి గుర్తుండే యాంకర్లలో సుమ, అనసూయ, రష్మి గౌతమ్, ఝాన్సీ, రోజా, శ్యామల, శ్రీ ముఖి లు బాగా ఫేమస్ అయ్యారు.అయితే వీళ్ళ వయసు ఎంత ఉంటుంది? ఏంటి? ఎప్పుడు పుట్టారు అనే వివరాలు చాలా మందికి తెలియదు.అందుకనే ఒకసారి ఈ యాంకర్స్ వయసు ఎంత ఉంటాయో.ఏంటో తెలుసుకుందాం.!

యాంకర్స్ లో మనం ముందుగా చెప్పే పేరు ఏదైనా ఉంది అంటే అది సుమా పేరే.సుమా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు.టీవీ షో అయిన గాని, సినిమా ఆడియో ఫంక్షన్ అయినాగానీ సుమా మాట్లాడే తీరు చూస్తే అమోఘం అని చెప్పాలి.నిజం చెప్పాలంటే సుమ తెలుగు అమ్మాయి కాదు.
అయినా కానీ తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతుంది.ఆమె యాంకరింగ్ ను సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు.
ఇంతకీ అసలు సుమ ఎప్పుడు పుట్టిందంటే మార్చ్ 25 వ తేదీన 1975 వ సంవత్సరంలో పుట్టింది.ఇప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు.సుమ వయసు నలభైకి పైబడిన గాని ఆవిడ క్రెజ్ మాత్రం అసలు తగ్గలేదు సుమా…!

అలాగే హీరోయిన్ రోజా విషయానికి వస్తే తెగ బిజీ అయిపొయింది.ఒకపక్క రాజకీయాలు మరో పక్క టీవీ షో లతో తెగ బిజీ అయిపొయింది.ఇంకా రోజా వయసు విషయానికి వస్తే నవంబర్ 17 వ తేదీన 1972 లో జన్మించినది.అంతే రోజా ప్రస్తుత వయసు 48 సంవత్సరాలు అన్నమాట.

అలాగే మరొక యాంకర్ ఝాన్సీ.దశాబ్దం పాటు యాంకర్ గా, సినిమా ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తుంది.ఇప్పటికే అడపాదడపా యాంకరింగ్ చేస్తూనే ఉంది ఝాన్సీ.ఈవిడ మార్చి 7 వ తారీఖున 1971 వ సంవత్సరంలో పుట్టింది.ఇప్పుడు ఝాన్సీ ప్రస్తుత వయస్సు 49 సంవత్సరాలు.

ఇకపోతే ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న యాంకర్ ఎవరనే ప్రశ్నకి సమాధానమే అనసూయ అని చెప్పవచ్చు.అనసూయ అందరికి జబర్దస్త్ షో ద్వారా సుపరిచితురాలు అయింది.ఈ ప్రోగ్రాం ద్వారా అనసూయ కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.
తన అందచందాలతోట, తన యాంకరింగ్ తోటి ప్రతి ఒక్కరి చూపుని తనవైపు తిప్పుకుంది అనసూయ.మరి ముఖ్యంగా అనసూయకి ఇద్దరు పిల్లలు ఉన్నాకూడా ఇప్పటికి అమ్మాయిలాగనే సెక్సీగా ఉంటుంది.
అనసూయని చూస్తే ఎవరికన్నా అసూయ పుట్టాలిసిందే.అనసూయ మే 15 వ తేదీన 1985 వ సంవత్సరంలో జన్మించినది.
ఇప్పుడు ఈమె వయస్సు 35 సంవత్సరాలు.

అలాగే ఉదయభాను కూడా అందరికి సుపరిచుతురాలే.ఆమె పదవ తరగతి చదివేటప్పుడు 1990 లో ఆర్ నారాయణ మూర్తి సినిమాలో కూతురిగా నటించింది.ఆ తర్వాత కొన్ని సినిమాలలో కూడా నటించింది.
అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఐటెమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది.ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.
అలా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను చాలా రోజులపాటు అలరించింది.ఈవిడ 1973 వ సంవత్సరంలో ఆగష్టు 4 వ తేదీన జన్మిచినది.
ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు.

ఇకపోతే యాంకర్ శ్యామల గురించి తెలుసుకుంటే శ్యామల ఆటో యాంకరింగ్ రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ కూడా నటిస్తోంది.యాంకర్స్ అందరికీ భిన్నంగా ఉంటుంది శ్యామల.అందరూ మోడరన్ డ్రెసెస్ తోటి అలరిస్తుంటె శ్యామల మాత్రం చీర, లంగా వోణి లతో మాత్రమే కనిపిస్తుంది.
సామల చాలా తక్కువ సమయంలో యాంకర్ గా బుల్లితెరలో నిలదొక్కుకుంది.ఈమె నవంబర్ 5, 1989 వ సంవత్సరంలో పుట్టింది.ఇప్పుడు ఈమె వయసు 31 సంవత్సరాలు.

అలాగే యాంకర్ శ్రీముఖి కూడా పటాస్ షో తో బాగా పాపులర్ అయింది.ఈమె గలగల మాట్లాడుతూ యాంకరింగ్ చేయడంలో దిట్ట.ఇప్పుడు ఉన్న యాంకర్స్ అందరిలో కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్లలో శ్రీముఖి ఒకటి.
మే, 10 వ తేదీన, 1993 వ సంవత్సరంలో పుట్టింది.శ్రీముఖి వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు.

ఇకపోతే లాస్ట్.బట్ నాట్ లీస్ట్ అంటున్న యాంకర్ ఎవరంటే రష్మీ గౌతమ్ అని చెప్పవచ్చు.మొదటిలో సినిమాల్లో నటించిన గాని పెద్దగా గుర్తింపు అయితే రాలేదు కానీ, జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసిన తర్వాత మాత్రం రష్మి జీవితమే మారిపోయింది అని చెప్పాలి.సెక్సీ లుక్స్ తో, పొట్టి పొట్టి దుస్తులతో కుర్రకారు మదిని దోచుకుంది రష్మీ.
ఇకపోతే రష్మీ ఏప్రిల్ 7, 1988 వ సంవత్సరంలో పుట్టింది.ఇప్పుడు రష్మి వయస్సు 32 సంవత్సరాలు.
చూసారు కదా మన టెలివిజన్ రంగంలోని యాంకర్ల వయసుని.వాళ్లు పుట్టిన తేదిని.
వయసు పెరుగుతున్న కానీ వీళ్ళ క్రెజ్ మాత్రం అసలు తగ్గడం లేదంటే ఆశ్చర్య పోవాలి కదా.!!
.