రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం బోప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియామకమైన షేక్ సబేరా బేగం గౌస్ లను వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,డైరెక్టర్ జంగా శ్రీకాంత్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిమేని చక్రాధర్ రెడ్డి బుధవారం సన్మానించారు.ఈ సందర్భంగా చక్రాధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని పార్టీ గుర్తించి నామినేట్ పదవులు అప్పగించడం జరిగిందని నామినేట్ పదవులు పొందిన కాంగ్రెస్ పార్టీ( Congress party ) నాయకులు పార్టీ కోసం పనిచేయాలని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య,మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య,డైరెక్టర్ మెండే శ్రీనివాస్ యాదవ్, కృష్ణారెడ్డి, నాయకులు బండారి బాల్ రెడ్డి,రాజు నాయక్,అంజిరెడ్డి, అనవేణి రవి తదితరులు పాల్గొన్నారు.