స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.
ఇక సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా బన్నీ ఇప్పటికే ప్రారంభించాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
పుష్ప అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటకే మొదలైంది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ లాక్డౌన్ సమయంలో బన్నీ తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించి కథలను వింటూ వచ్చాడు.ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను బన్నీ వినగా, తాజాగా ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
బన్నీ కెరీర్లో 21వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను GA2 బ్యానర్ మరియు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ను బన్నీ, కొరటాల తమ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కాగానే మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాను తెరకెక్కిస్తుండగా, బన్నీ పుష్పలో నటిస్తున్నాడు.
ఈ రెండు సినిమాను పూర్తికాగానే వారు ఈ సినిమాను ప్రారంభిస్తారు.