గొల్లపల్లిలో బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా: అన్నదానం కంటే నీళ్ల దానం( Donation of water ) చాలా గొప్పది వేసవి కాలం కావడంతో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండులో సోమవారం లయన్స్ క్లబ్( Lions Club ) ఆధ్వర్యంలో కోట మల్లయ్య జ్ఞాపకార్థంతో సతీష్ కుమార్ ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ నిర్వాహకులు పేర్కొన్నారు.

 Chalivendram Starts At The Bus Stand In Gollapally Donation Of Water, Yellareddy-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండకాలంలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మొదటి రోజు మజ్జిగ అందజేయడం జరిగిందని తెలిపారు.లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, కోట సతీష్ లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల మల్లారెడ్డి, డిస్టిక్ క్యాబినెట్ మెంబర్స్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, నంది కిషన్, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు పెంజర్ల రవి, పార్టీ దేవయ్య, ముత్యాల కృష్ణారెడ్డి, చేపూరి రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube