తెలంగాణ ప్రజలకి వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. పవన్ కళ్యాణ్

రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్ పై వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం… ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా మారింది గతంలో కూడా నాయకులకు నేను ఒకటే చెప్పాను.పాలకులు వేరు ప్రజలు వేరు.

 Ycp Should Apologize Unconditionally To The People Of Telangana , Telangana, Har-TeluguStop.com

పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదు.మంత్రి హరీష్ రావు ఏ సందర్భంగా వ్యాఖ్యాలు చేశారో తెలియదు.

దానికి ప్రతి స్పందనగా వైసీపీ నాయకులు, మంత్రులు తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించింది దయ చేసి వైసీపీ నాయకులకు నా విన్నపం… నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి.

సదరు తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయి అనుకుంటే ఆయన్నే విమర్శించండి అంతేకానీ తెలంగాణ ప్రజలను వివాదాల్లోకి లాగవద్దు ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు దీనిపై స్పందించాలి.

మీకు తెలంగాణలో ఇళ్లు, వ్యాపారాలు ఉన్నాయిబొత్స లాంటి వాళ్లు ఇక్కడ  వ్యాపారాలు చేసిన వాళ్లే కదా? బొత్స కుటుంబానికి ఇక్కడ కేబుల్ వ్యాపారం ఉండేది.దయచేసి మంత్రి వర్గంలో ఎవరైనా అదుపు తప్పి మాట్లాడితే తోటి మంత్రులతోపాటు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించాలి.

తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube