తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.
సాధారణంగా మనం ఒక సినిమాలో నటించడం అంటే మనం నటించిన పాత్రలు సినిమాలో ఉంటాయో లేదో సినిమా విడుదలయ్యే వరకు మనకి కూడా తెలియదు.ఇలా కొంతమంది నటించిన సన్నివేశాలు కనిపించకపోవడంతో చాలా బాధపడుతుంటారు.
అచ్చం ఇలాంటి అనుభవమే నటుడు మురళీమోహన్ కి కూడా ఎదురైందని చెప్పాలి.
చిత్రం మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమాలలో నిజం ఒకటి.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రక్షిత హీరోయిన్ గా నటించారు.ఇక సెకండ్ హాఫ్ లో భాగంగా ఓ కీలక పాత్రలో నటించడం కోసం తేజ మురళీమోహన్ ని సంప్రదించారు.
ఇక ఈయన పై షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల అయ్యాక అందులో మురళీమోహన్ బదులు ప్రకాష్ రాజ్ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఇలా తను నటించిన పాత్రలో తాను కాకుండా ఇతరులను తీసుకోవడంతో ఎంతో ఫీల్ అయిన మురళీ మోహన్ తనకు చాలా అవమానం జరిగిందని దీంతో తనకు నష్టపరిహారంగా 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇలా అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో సినీ పెద్దలు కూర్చొని 5 లక్షల నష్టపరిహారం చెల్లించారు.సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత మురళీమోహన్ ను ఆ పాత్ర నుంచి తప్పించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…మురళీమోహన్ బాడీ లాంగ్వేజ్ లిప్ మూమెంట్ సరిగ్గా కుదరక పోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వినిపించడంతో ఎంతోమంది ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు చేశారు.
ఈ విధంగా మురళీమోహన్ ను నిజం సినిమాలో పక్కన పెట్టాల్సి వచ్చింది.