టాలీవుడ్ లో ఎప్పుడూ విభిన్న కథనాలు మరియు కొత్తకొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందు వరసలో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియనివారుండరు.ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.
అయితే ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలుకొట్టి చెప్పడం రామ్ గోపాల్ వర్మ స్పెషాలిటీ.అందువల్లే రాంగోపాల్ వర్మ మేనరిజానికి భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర సినీ పరిశ్రమల్లో సైతం అభిమానులున్నారు.
అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం విధించినటువంటి లాక్ డౌన్ లో పలు సడలింపులు చేస్తూ మద్యం అమ్మకాలకి అనుమతులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా గత 40 రోజులుగా మద్యం దొరకక ఇబ్బందులు పడుతున్నటువంటి మందుబాబులు మద్యం దుకాణాలకు క్యూ కట్టారు.
అంతేకాక మహిళలు కూడా ఎప్పుడూ లేని విధంగా మద్యం దుకాణాలకు రావడంతో రాంగోపాల్ వర్మ మద్యం కోసం క్యూలో నిలబడిన మహిళల ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అంతేకాక ఈ ఫోటోకి “మద్యం దుకాణాల ముందు ఎవరు నిల్చున్నారో చూడండి” అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ పై తాజాగా ఓ మహిళ స్పందించింది.ఇందులో భాగంగా “మగవాళ్ళ లాగే ఆడవాళ్ళకి కూడా మద్యం కొనుక్కొని సేవించేటువంటి స్వతంత్ర హక్కు ఉంటుందని, కానీ మద్యం సేవించి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే హక్కు ఎవరికీ ఉండదని” అది తెలుసుకోకుండా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ రిప్లై ఇచ్చింది.
దీంతో తాజాగా ఆ మహిళ చేసినటువంటి వ్యాఖ్యల పై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.ఇందులో భాగంగా మీరు నేను చేసినటువంటి వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారని అంతేగాక మద్యాన్ని కేవలం మగ వాళ్ళు మాత్రమే తాగుతారని, తాగిన అనంతరం ఆ మత్తులో ఆడవాళ్ళని తప్పుడు అసభ్య పదజాలంతో దూషిస్తారని అభిప్రాయపడే కొందరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఒకపక్క మగవారికి సపోర్ట్ చేస్తునే తనదైన శైలిలో రిప్లై ఇవ్వడంతో నెటిజనులు ట్వీట్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.