ఆర్ఎక్స్ 100 చిత్రంతో హిట్ దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి.ఈయన రెండవ సినిమా మహా సముద్రంను ప్రకటించి దాదాపుగా ఏడాదిన్నర అయ్యింది.
కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ముందడుగు పడలేదు.ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
సినిమా షూటింగ్ ఏమో కాని ఆయన తదుపరి చిత్రాలను వరుసగా ప్రకటిస్తున్నాడు.ఇప్పటికే మహాసముద్రం కాకుండా మరో సినిమాను ప్రకటించిన అజయ్ భూపతి ఇప్పుడు తన మూడవ సినిమాను ప్రకటించాడు.
కార్తికేయ, పాయల్ రాజ్పూత్ హీరో హీరోయిన్గా నటించిన ఆర్ఎక్స్ 100 చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చిన ఈయన పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. మహాసముద్రం చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతున్నా కూడా తప్పకుండా ఆ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో ఆర్ఎక్స్ 100 సినిమాకు సీక్వెల్ చేస్తానంటూ ప్రకటించాడు.
కార్తికేయ హీరోగా ఆర్ఎక్స్ 100 చిత్రం సీక్వెల్ చేస్తానంటూ లైవ్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆ సినిమాలో హీరో చనిపోతాడు.మరి కథ కొనసాగింపు ఎలా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
కథకు సీక్వెల్ ఛాన్స్ లేదు కాని అవే పాత్రలతో కొత్త కథను తీసుకుని సినిమాను తీస్తాడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ను సెట్స్ పైకి తీసుకు వెళ్తానంటూ ప్రకటించాడు.
మరి హీరోయిన్గా పాయల్ను నటింపజేస్తాడా లేదంటే మరెవ్వరినైనా రంగంలోకి దించుతాడో చూడాలి.