సినిమా ఇండస్ట్రీలో హీరోల వారసులుగా అబ్బాయిలు ఎంతో మంది వచ్చారు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో మెజార్టీ శాతం వారు వారసులే అనడంలో సందేహం లేదు.
అందుకే టాలీవుడ్ లో ఎక్కువ శాతం వారసులుగా అబ్బాయిలు వస్తూ ఉండటం మనం చూడవచ్చు.అతి కొద్ది మంది అమ్మాయిలు మాత్రమే వారసులుగా ఎంట్రీ ఇచ్చారు.
వారిలో కొందరు పర్వాలేదు అనిపించగా కొందరు మాత్రం నిరుత్సాహంతో కెరీర్ ను ముగించారు.మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనకంటే ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించింది.
ముఖ్యంగా ఆమె ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు అయితే తెచ్చుకుంది.కాని ఆమె తెలుగు మాట్లాడే విధానం కాస్త ఓవర్ యాక్షన్ ను జనాలు మాత్రం విమర్శించడం మొదలు పెట్టారు.
మంచు లక్ష్మి హీరోయిన్ గా కాకుండా కెరీర్ ఆరంభం నుండి విలక్షణమైన నటిగా గుర్తింపు దక్కించుకుంది.అలాగే బుల్లి తెరపై ఆమె హోస్ట్ గా పలు షో లను చేసింది.
కొన్ని టాక్ షో లకు మంచి పేరు వచ్చింది.హోస్ట్ గా.నటిగా.డైరెక్టర్ గా నిర్మాతగా సోషల్ మీడియాలో ఒక వక్తగా మంచి తల్లిగా ఎన్నో రకాల పాత్రలను ఇప్పటి వరకు పోషిస్తూ వచ్చింది.
ఆమె చేసేది ఏదైనా మొదట విమర్శలు ఎదుర్కొంటుంది.ఎందుకంటే ఆమె మాట తీరు అలా ఉంటుంది.
ఆమె మాట తీరు కాస్త బాడీ లాంగ్వేజ్ లో తేడా వల్ల కొందరు ఆమెను బాబోయ్ ఇదేం కర్మ రా బాబు అంటూ ఉంటారు.అలాంటి వారే ఇప్పుడు ఆహా కోసం చేస్తున్న వంటల షో ఆహా భోజనంబు ను విమర్శిస్తున్నారు.వంటలు చేసుకుంటూ మరెన్ని రకాల హొయలను పోతుందో అంటున్నారు.ఆమె అభిమానుల మాత్రం ఆహా భోజనంబు కోసం వెయిట్ చేస్తున్నామంటున్నారు.