దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.ఈ క్రమంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించాయి.
అటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో( South Central Bay of Bengal ) వాయుగుండం కొనసాగుతోంది.రానున్న 12 గంటల్లో వాయుగుండం బలపడి తుఫాన్ గా( Cyclone ) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Weather Department ) అధికారులు తెలిపారు.
ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ను ఆనుకొని ఉన్న ఖెపురా వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ తుఫాన్ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది.