విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్( Visakha Human Trafficking ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కంబోడియా( Cambodia ) సైబర్ నేరస్థుల నుంచి 58 మందికి విముక్తి కలిగించారు.
వీరిలో ఏపీకి చెందిన వాళ్లు 40 మంది ఉన్నట్లు గుర్తించారు.అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు 18 మంది ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో కంబోడియా నుంచి భారత్ కు చెందిన 58 మంది బాధితులు విశాఖకు రానున్నారు.కంబోడియా నుంచి విశాఖకు వస్తున్న వారి కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు.
కాగా హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో సుమారు 150 మంది చిక్కుకున్నారని సమాచారం.ఇక దేశ వ్యాప్తంగా ఈ విధంగా చిక్కుకున్న బాధితులు ఐదు వేల మంది ఉంటారని అంచనా.