ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని రాష్ట్ర సీఈవో ఎంకే మీనా( AP CEO MK Meena) అన్నారు.3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు.
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ తో కలిసి 81.86 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో వెల్లడించారు.దర్శిలో అత్యధికంగా 90.01 శాతం నమోదు అయిందని పేర్కొన్నారు.అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదు అయిందన్న ఆయన పార్లమెంట్ కి మూడు కోట్ల 33 లక్షల 4,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.350 స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలను భద్రపరిచామని తెలిపారు.