కరోనా కారణంగా పెళ్లిలు చాలా సింపుల్గా చేసుకోవాలంటూ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.చావుకు పది మంది పెళ్లికి ఇరువై మంది అంటూ కండీషన్స్ పెడుతున్నారు.
కాని పెళ్లి విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదు.వందల మంది పెళ్లిలకు హాజరు అవుతున్నారు.
పెద్ద ఎత్తున వివాహ వేడుకలు జరుగుతున్నాయి.కాని నయనతార మాత్రం తన వివాహ వేడుకను అత్యంత సింపుల్గా చేసుకునేందుకు సిద్దం అయ్యింది.
గుడిలో కేవలం 20 నుండి 30 మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహం జరుగబోతుందట.
నాలుగు సంవత్సరాలుగా విఘ్నేష్ శివన్తో నయన్ ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.
వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారు.ఎప్పటికి అయినా పెళ్లి చేసుకోవాల్సిందే కనుక వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
అయితే నయన్ కోరిక మేరకు గుడిలో పెళ్లి చేసుకునేందుకు విఘ్నేష్ శివన్ ఓకే చెప్పాడని తెలుస్తోంది.ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.
అన్ని విధాలుగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీఠలు ఎక్కి తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించబోతున్నారు.
గుడిలో మొదట పెళ్లి చేసుకున్న తర్వాత చర్చ్లో క్రైస్తవ మతాచారం ప్రకారం కూడా పెళ్లి చేసుకోబోతున్నారు.నయన్ క్రిస్టియన్ అనే విషయం తెల్సిందే.అందుకే రెండు మతాల ఆచారాల ప్రకారం పెళ్లి జరుగబోతుంది.
గతంలో నాగచైతన్య మరియు సమంతల వివాహం రెండు ఆచారాల ప్రకారం జరిగింది.అలాగే వీరి వివాహం కూడా అదే మాదిరిగా జరుగబోతుంది.