ఒక హీరో కోసం మరో హీరోను పక్కన పెట్టడం సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.ఇప్పుడు మనం చెప్పుకోబోయే డైరెక్టర్ మాత్రం కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోతో పాటు, కుర్ర హీరోను కూడా లైన్లో పెట్టాడు.
అలా ఇద్దరు ఒప్పుకోవడంతో ఎవరితో చేయాలో తర్జనభర్జన పడి మరీ స్టార్ హీరోకు ఓకే చెప్పి ఆయనతో సినిమా స్టార్ట్ చేసాడు.దీంతో యంగ్ హీరోను పక్కన పెట్టక తప్పలేదు.
అయితే ఇప్పుడు ఆయన యంగ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు.మరి ఆ డైరెక్టర్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అథ్దె పరుశురామ్ పెట్ల. గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుని స్టార్ డైరెక్టర్ ల దృష్టిలో పడ్డాడు.ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమాను చేసాడు.
ఈయన గీత గోవిందం తర్వాత నాగ చైతన్య తో సినిమా చేయాలనీ ఆయనను ఒప్పించాడు.
అయితే అదే సమయంలో మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో ఆయన నాగ చైతన్య ను పక్కన పెట్టి సూపర్ స్టార్ తో సినిమా చేసాడు.
ఇక ఇప్పుడు ఈ సినిమా పూర్తి అవ్వడంతో నాగ చైతన్య తో సినిమా లైన్లో పెట్టనున్నాడు.చైతన్య తో సినిమాని ప్లాన్ చేసిన 14 రీల్స్ సంస్థ మహేష్ సినిమాకు కూడా నిర్మాతలుగా వ్యవహరించడంతో ఆయనకు మహేష్ బాబు తో పని చేసే అవకాశం సులువు అయ్యింది.
ఇక మహేష్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి మే 12న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో 14 రీల్స్ సంస్థ గతంలో ఓకే చేసిన నాగ చైతన్య ప్రాజెక్ట్ ను ఇప్పుడు పట్టాలెక్కించ నున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రెసెంట్ చైతూ వరుస సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లు కూడా అందుకుంటూ బిజీగా ఉన్నాడు.ఈయన విక్రమ్ కే కుమార్ తో థాంక్యూ సినిమా పూర్తి చేసి ఇటీవలే ఇదే డైరెక్టర్ తో దూత అనే మరో ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసారు.ఇది ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో బైలింగ్వన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.