‘గోపాల గోపాల’ సెన్సార్ నిన్ననే కావాల్సి ఉన్నా కూడా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల నేడు సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ను జారీ చేసింది.
చిన్న పెద్ద అంతా కలిసి చూసే విధంగా ఉందని సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు సినిమాపై పాజిటివ్గా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది.ఒక మంచి సినిమా చూసిన అనుభూతికి తాము లోనైనట్లుగా సెన్సార్ బోర్డు సభ్యులు నిర్మాతలతో అన్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్, వెంకటేష్లు కలిసి నటించిన ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహించాడు.సురేష్బాబు మరియు శరత్ మరార్లు సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా శ్రియ నటించింది.ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.మరో హీరోయిన్ దీక్షాపంథ్ ముఖ్య పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా ఈ నెల 10 లేదా 11న విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.