మొట్టమొదటిసారి అవయవాల తరలింపు కోసం మెట్రో రైల్ ను వినియోగించారు.హైదరాబాద్ నాగోల్ లోని కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పోలీసులు మెట్రో రైల్ లో గుండెను తరలించారు.
సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు హార్ట్ తో వైద్యులు ప్రయాణించారు.కాగా 25 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయినట్టు వైద్యులు వెల్లడించారు.