హైదరాబాద్ లోని బాచుపల్లిలో( Bachupally ) చోటు చేసుకున్న ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆరా తీశారు.గోడకూలి ఏడుగురు చనిపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంఘటనపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కాగా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో( Renuka Ellamma Colony ) సెంట్రింగ్ పని కార్మికుల షెడ్ పై రిటైనింగ్ వాల్ పడిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు ఒడిషా, ఛత్తీస్ గఢ్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు.