ప్రతినిత్యం మనం సోషల్ మీడియా( Social media ) ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ., ఇట్లే తెలిసిపోతుంది.
అప్పుడప్పుడు కొందరి శరీర భాగాల్లో రకరకాల వస్తువులు కనిపించడం సంబంధించిన విషయాలు కూడా మనం మీడియా ద్వారా తెలుసుకునే ఉంటాము.ఇందులో భాగంగానే శరీరంలో కొన్ని కేజీల అదనపు శరీర భాగాలు.
, ముఖ్యంగా మూత్రపిండాలలో వందల సంఖ్యలో రాళ్లు.అలాగే కాలేయంలో వెంట్రుకలు ఇంకా అనేక రకాల వస్తువులు కనపడేలాంటి విషయాలు తెలుసుకునే ఉంటాం.
అయితే తాజాగా జైపూర్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.జైపూర్( Jaipur ) కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర కడుపునొప్పి కారణంతో ఆసుపత్రికి తరలించగా అతడి కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలోకి వెళ్తే.తాజాగా జైపూర్ లోని సవాయినా మాస్ సింగ్ ( Mas Singh )హాస్పిటలకు ఒక యువకుడు కడుపునొప్పి కారణంతో అడ్మిట్ అయ్యారు.హాస్పిటల్లోని సీనియర్ వైద్యుడైన రాజేంద్ర మాండియా ఆ యువకుడి కడుపులో సూదులు, తాళం, గింజలు, బోల్టలు ఉన్నట్లు ఎక్సరే, సిటీ స్కాన్ ద్వారా తెలుసుకున్నట్లు మీడియాతో తెలియజేశారు.అంతేకాకుండా ముఖ్యంగా ఇనుప వస్తువులు ఆ యువకుడి పెద్ద పేగులో ఉన్నందుకు డాక్టర్ స్లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలియజేశారు.
ఆ యువకుడి కడుపులో ఉన్న ఇనుప వస్తువులను( Iron objects ) బయటకు తీసేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టిందని వైద్యుడు తెలిపారు.వాస్తవానికి ఆ యువకుడికి మానసికంగా బలహీనంగా ఉన్నందు కారణంగా ఆ ఇనుప వస్తువులు మింగేసినట్లు కుటుంబ సభ్యులు డాక్టర్స్ కి తెలియజేశారు.
ప్రస్తుతం ఆ యువకుడికి ఎటువంటి ఇబ్బంది లేదని కుటుంబ సభ్యులకు డాక్టర్స్ తెలిపారు.