కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సినిమాలో రాజమౌళి ( Rajamouli ) గెస్ట్ రోల్ లో కనిపిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది.కల్కి మూవీ సెకండాఫ్ లో జక్కన్న షాకింగ్ రోల్ లో కనిపించి మెప్పించారు.
ఆ సమయంలో ప్రభాస్( Prabhas ) ఛాన్స్ ఇస్తే ఐదేళ్లు తీసుకున్నావ్ అని చెప్పగా ఈసారి పదేళ్లు తీసుకుంటా అని జక్కన్న పేర్కొన్నారు.ఈ విధంగా ప్రభాస్ తో మరో సినిమాను జక్కన్న ఫిక్స్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ రాజమౌళి కాంబోలో మహాభారతం( Mahabharatam ) తెరకెక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.మహేష్ తో సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్పకనే చెప్పేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ రాజమౌళి కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ రాజమౌళి కాంబోలో మరో సినిమా తెరకెక్కితే ఆ సినిమా బాహుబలి 2 సినిమాను మించిన సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజమౌళి ఈ మేరకు త్వరలో అధికారికంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
రాజమౌళి ఇకపై వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ హిట్స్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ రాజమౌళి కాంబో మూవీ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.