ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ లోని ప్రజాభవన్( Praja Bhavan ) కు వచ్చిన బాంబు బెదిరింపు కేసుపై పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Accused Arrested In Praja Bhavan Bomb Threat Case ,praja Bhavan , Praja Bhavan-TeluguStop.com

అయితే ప్రజాభవన్ లో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలిపోతుందంటూ నిందితుడు ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రజాభవన్ ను జల్లెడ పట్టారు.

సుమారు రెండు గంటల పాటు గాలించిన పోలీసులు ఫేక్ కాల్ గా నిర్ధారించారు.ఈ క్రమంలోనే ఇవాళ నిందితుడు శివరామకృష్ణ( Sivaramakrishna )ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముషీరాబాద్ లో నివాసం ఉంటున్న శివ రామకృష్ణ మద్యం మత్తులో కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసినట్లు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube