చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సినిమాలు చాలా ఫాస్ట్ గా చేస్తూ పోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేసురుకుంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.
తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ అని ఇప్పటికే కొరటాల శివ తెలిపాడు.
ఇందులో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.
చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.ఈ సినిమా ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు.
త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యనే చిరు బర్త్ డే సందర్భంగా ముందు కొత్త సినిమాలను ప్రకటించాడు.
అందులో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా వస్తుంది.
ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.ఇక తాజాగా ఈ సినిమాలో మరొక బాలీవుడ్ బ్యూటీ నటిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మలయాళంలో ‘మంజు వార్యర్’ నటించిన పాత్రను తెలుగులో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తుందని తాజా సమాచారం.ఇది మెగాస్టార్ కు చెల్లెలి పాత్ర.ఇక ఈ విషయం నిజమైతే చిరంజీవి విద్యాబాలన్ కాంబినేషన్ బాగుంటుందని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇది చాలా ఎమోషనల్ పాత్ర కాబట్టి విద్యాబాలన్ నటిస్తే తెరపైన బాగుటుందని అనుకుంటున్నారు.
మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.