షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు..: సజ్జల

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై( YS Sharmila ) వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు.షర్మిల వాడిన భాష సరికాదని పేర్కొన్నారు.

 Why Sharmila Came To Ap From Telangana Sajjala Details, Ap Government Advisor Sa-TeluguStop.com

షర్మిల వ్యాఖ్యలు తామందరికీ బాధ కలిగించాయని సజ్జల తెలిపారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు.

సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసిందన్నారు.

అలాగే వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.వైఎస్ ఆశయాలకు సీఎం జగన్( CM Jagan ) కట్టుబడి పని చేస్తున్నారని తెలిపారు.ఏపీని విడగొట్టిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.తెలంగాణలో షర్మిల ఏం చేశారని ప్రశ్నించిన సజ్జల అక్కడి నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube