ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ).బాహుబలి చిత్రంతో దేశమంతటా వ్యాపించిన ఈయన కీర్తి….
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచమంతా పాకింది.రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి చిత్రానికి సంగీతం అందించింది కీరవాణి గారు.
కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములన్న సంగతి మనందరికీ తెలిసినదే.ఐతే వీరు సొంత అన్నదమ్ములు కాదు….
కజిన్స్.కానీ వీరి మధ్య అనుబంధం చూస్తే సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆప్యాయతతో కలిసి ఉంటారు.
రాజమౌళి అంటే కీరవాణి( Keeravani )కి చాలా ప్రేమ.మరి అంత ఇష్టమైన వ్యక్తిని కీరవాణి ఏమని పిలుస్తారో తెలుసా.
రాజమౌళి కీరవాణి కంటే చిన్న వాడు.అందుకే కీరవాణి రాజమౌళిని ముద్దు పేరు తో పిలుస్తారట.మొదట్లో కీరవాణి రాజమౌళిని చిన్నప్పుడు “బంటీ” అని పిలిచేవారట.తరువాత కొన్నాళ్ళకు అది “నంది” గా మారిందట.ఇప్పుడు ఇంట్లో అందరు రాజమౌళిని నంది అనే పిలుస్తారట.దగ్గరగా ఉంటె కొన్నిసార్లు చనువుగా “ఏరా…” అని అంటారట.
అందరి మధ్యలో బయట ఉంటె రాజమౌళి అని పిలుస్తారట.ఇలా ప్రదేశాన్ని బట్టి పిలుపు మారుతుందట.
రాజమౌళి మాత్రం కీరవాణిని గౌరవంగా “పెద్దన్న” అని పిలుస్తాడట.
కీరవాణి 1961 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోకి పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు లో జన్మించారు.కీరవాణి తండ్రి కోడూరి శివశక్తి దత్త( Siva Shakthi Datta ), రచయత మరియి స్క్రీన్ రైటర్ గా పనిచేసేవారు.ఆయన చంద్రహాస్ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.
కీరవాణిని సంగీత దర్శకుడు చక్రి కి పరిచయం చేసారు ఆయన.కీరవాణి సంగీతం అందించిన మొదటి చిత్రం మనసు మమతా (1990).కీరవాణి తన కెరీర్ లో 11 నంది అవార్డులు, 8 ఫిలింఫేర్ అవార్డులు, 2 నేషనల్ అవార్డులు అందుకున్నారు.ఈ ఏడాది భారత ప్రభుత్వం ఆయన్ను “పద్మ శ్రీ” తో సత్కరించింది.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఈయన ఆస్కార్ అందుకున్నా విషయం మనందరికీ తెలిసినదే.