పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది.గంజాయి మత్తులో యువకులపై దాడి చేశారు.
టిఫిన్ షాప్ కు వచ్చిన యువకులపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ దాడిలో టిఫిన్ షాపుతో పాటు ఏటీఎం ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.
గంజాయి బ్యాచ్ వీరంగంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.