విజయనగరం జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం

విజయనగరం జిల్లాలో గజరాజుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.వంగర మండలం తలగాం సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది.

 Movement Of Elephants In Vizianagaram District Is Disturbed-TeluguStop.com

పార్వతీపురం మన్యం నుంచి వంగర మండలంలోకి ఏడు ఏనుగులు ప్రవేశించిన విషయం తెలిసిందే.ఇప్పటికే మండలంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.

గజరాజుల దాడులతో వంగర మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ మేరకు అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

తాజాగా మన్యం జిల్లా భామిని మండలంలో మరో పది ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.దీంతో గజరాజుల దాడుల నుంచి తమను, తమ పొలాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube