అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన పుష్ప సినిమా సీక్వెల్ ప్రస్తుతం రూపొందిపోతుంది.
పుష్ప సినిమా 400 కోట్ల రూపాయలు కలెక్షన్స్ నమోదు చేసిన కారణంగా సీక్వెల్ కనీసం 600 కోట్ల రూపాయలైనా కలెక్షన్స్ నమోదు చేయాలని దర్శకుడు సుకుమార్ చాలా పట్టుదలతో ఉన్నాడట.అందుకే సంవత్సర కాలం పాటు స్క్రిప్ట్ వర్క్ కి సమయం తీసుకున్నాడు.
అయినా కూడా హీరో అల్లు అర్జున్ ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఆయనకు కావలసినంత సమయాన్ని ఇచ్చేశారు.
ఎట్టకేలకు సినిమా యొక్క కథ రెడీ అయింది.
షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభం అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.అల్లు అర్జున్ లేకుండానే సినిమా యొక్క మొదటి షెడ్యూల్ పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమా తీస్తున్న సమయంలోనే కొన్ని సన్నివేశాలను అదనంగా తీయడం జరిగిందని.వాటికి సంబంధించిన షాట్స్ మరియు వీడియోలను సీక్వెల్ కోసం వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.
ఇప్పటికే అల్లు అర్జున్ పై చిత్రీకరణ ప్రారంభం అవ్వాల్సి ఉంది కానీ ఆయన ఆఫ్రికా వెళ్లడం తో పాటు ఏదో ఒక పని పై బిజీ గా ఉంటున్నారు.అందుకే అల్లు అర్జున్ రాక కోసం సుకుమార్ వెయిట్ చేస్తున్నారు.ఇదే సమయం లో వచ్చే నెలలో పుష్ప 1 సినిమా విడుదల ఈ సంవత్సరం కాబోతున్న నేపద్యంలో సీక్వెల్ కి సంబంధించిన సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయానికి సుకుమార్ వచ్చాడట.అది టీజర్ అయితే ఇంకా బాగుంటుందని అంతా భావిస్తున్నారు.
షూటింగ్ మొదలు పెట్టక ముందే టీజర్ ఎలా విడుదల చేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే.మరి కొందరు మాత్రం సుకుమార్ కి ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్ చేస్తున్నారు.