వీడియో: భారీ వరదలో రోడ్డు దాటేందుకు టూరిస్టు బస్సు యత్నం... చివరికి..?

వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్డు దాటకుండా సురక్షితమైన ప్రదేశాలకు వెను తిరిగి వెళ్లిపోవడం మంచిది.లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

 Viral Video Tourist Bus Carrying 37 Passengers Stranded In Floodwaters In Gujara-TeluguStop.com

మొన్నీ మధ్య తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల కారణంగా ఇలా రోడ్లు దాటుతూ చాలామంది మరణించారు కూడా.అయితే రీసెంట్ గా గుజరాత్ రాష్ట్రంలోని( Gujarat ) భావ్‌నగర్ జిల్లాలో ఓ డ్రైవర్ వరద నీటిలో( Flood Water ) రోడ్డు క్రాస్ చేద్దామనుకున్నాడు.

ఆ సమయంలో బస్సు నిండా టూరిస్ట్ లో ఉన్నారు.

భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో వరదలు పోగొట్టుతున్నాయి.

ఒక టూరిస్టు బస్సు( Tourist Bus ) డ్రైవర్ వరద నీటిని తక్కువ అంచనా వేశాడు.రోడ్డు మధ్యలోకి తీసుకెళ్లాగా వరద ఇంకా పెరిగిపోయింది.

వెంకటయ్య కాలవలో ఇరుక్కున్నాయి.బాగా యాక్సిలరేషన్ ఇచ్చి ముందుకు వెళ్తే బస్సు కొట్టకపోవడం ఖాయం అనిపించింది.

ఇక చేసేదేమీ లేక అతడు బస్సును వరద నీటిలో ఆపేశాడు.ఆ సమయంలో 37 మంది ప్రయాణికులు, వారిలో 29 మంది తమిళనాడుకు చెందినవారు ఉన్నారు.

అయితే ఈ సంగతి తెలియడంతో వెంటనే పోలీసులు వారిని సురక్షితంగా కాపాడారు.

పోలీసుల ప్రకారం, గురువారం సాయంత్రం కోలియా గ్రామం సమీపంలోని ఒక వంకపై ఉన్న రోడ్డుపై బస్సు నిలిచిపోయింది.వర్షాల కారణంగా ఆ ప్రాంతం మొత్తం నీట మునిగిపోవడంతో బస్సు నీటిలో చిక్కుకుంది.సమాచార సంస్థ పీటీఐ విడుదల చేసిన వీడియోలో బస్సు నీటిలో మునిగి ఉన్న దృశ్యాలు ఉన్నాయి.

అంతేకాకుండా, రక్షించబడిన ప్రయాణికులను తీసుకెళ్తున్న ఒక చిన్న వాహనం కూడా వరద నీటిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

భావ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆర్.కె.మెహతా ఇచ్చిన వివరాల ప్రకారం, వరద నీరు నిండిపోయిన కాలువ మీదుగా బస్సును తీసుకెళ్లాలని బస్సు డ్రైవర్( Bus Driver ) నిర్ణయించుకున్నాడు.కానీ, వరద నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటంతో బస్సు ముందు భాగం నీటిలో మునిగిపోయింది.అయితే, బస్సు వెనుక భాగం కాలువలో ఇరుక్కుపోయింది.“రక్షణ బృందం ఒక చిన్న వాహనంలో అక్కడికి చేరుకుంది.బస్సు వెనుక విండో ద్వారా ప్రయాణికులను, డ్రైవర్, క్లీనర్‌ను ఆ చిన్న వాహనంలోకి మార్చారు” అని కలెక్టర్ తెలిపారు.

“మేము ఒక పెద్ద వాహనాన్ని పంపి, ఆ 29 మందిని ఆ వాహనంలోకి మార్చాము.దాదాపు ఎనిమిది గంటల తర్వాత, ఉదయం 3 గంటలకు, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాము.

భావ్‌నగర్‌లో( Bhavnagar ) వారికి నివాసం, ఆహారం అందించాము.వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాము” అని కలెక్టర్ పీటీఐకి తెలిపారు.

పోలీసుల ప్రకారం, ప్రయాణికులలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు.ఇలా వరద ప్రవాహం గుండా ఎవరూ రోడ్డు క్రాస్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube