భారతీయ మొబైల్ మార్కెట్లో ప్రతి నెలా ఎన్నో మొబైల్ ఫోన్లు సందడి చేస్తుంటాయి.ఈ నెలలో కూడా కొన్ని ఫోన్లు మొబైల్ లవర్స్ను పలకరించనున్నాయి.వాటిలో టాప్ ఫోన్స్పై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.
రియల్మీ జీటీ నియో 3టీ 5జీ
రియల్మీ జీటీ నియో 3టీ 5జీ ఈ నెలలోనే ఇండియాలో లాంచ్ కానుంది.ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 120 Hz రిఫ్రెష్ రేట్తో 6.62 అంగుళాల పంచ్-హోల్ అమోలెడ్ డిస్ప్లే, బెజెల్-లెస్ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఫుల్ హెచ్డీ @30fps వీడియో రికార్డింగ్, 5000 ఎంఏహెచ్, 80వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లున్నాయి.దీని రూ.29,999గా ఉండొచ్చని తెలుస్తోంది.
షియోమీ 12 ఎక్స్ 5జీ
షియోమీ 12ఎక్స్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో ఇండియాలో ఈ నెలలోనే లాంచ్ కానుంది.ఇందులో ఒకటి 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే… రెండోది 8జీబీ ర్యామ్+256జీబీతో రానుంది.షియోమీ 12ఎక్స్ లో 6.28-అంగుళాల ఫుల్ హెచ్డీ+అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 1100 నిట్స్ వరకు బ్రైట్నెస్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, MIUI 13, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5ఎంపీ టెలిమాక్రో కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.ధర రూ.37,590గా నిర్ణయించే అవకాశం ఉంది.
శాంసంగ్ ఏ13 5జీ
శాంసంగ్ ఏ13 5జీ కూడా ఇదే నెలలో మొబైల్ ప్రియులను పలకరించనుంది.మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, 90 Hz రిఫ్రెష్ రేట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 2 ఎంపీ డెప్త్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 5000 ఎంఏహెచ్, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ వంటి అట్రాక్ట్ ఫీచర్లున్నాయి.దీని ధర రూ.19 వేలు ఉండొచ్చని తెలుస్తోంది.
రూ.35వేల ధరతో వన్ప్లస్ నార్డ్ 2టీ, స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ ప్రాసెసర్తో పోకో ఎఫ్4 జీటీ కూడా జూన్లో రిలీజ్ కావచ్చని తెలుస్తోంది.