టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణుల్లో నదియా ఒకరు.ఆమె అసలు పేరు జరీనా కాగా నదియాగా మార్చుకున్నారు.
తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ముంబైలోని ముస్లిం ఫ్యామిలీలో ఆమె జన్మించారు.
మిర్చి, అత్తారింటికి దారేది, దృశ్యం సినిమాలు నటిగా నదియాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు.సర్కారు వారి పాట సినిమాలో చిన్న రోల్ లోనే నటించినా ఆ రోల్ వల్ల నటిగా నదియాకు మంచి మార్కులు పడ్డాయి.1984 సంవత్సరంలో నటిగా నదియా కెరీర్ మొదలైంది.అమ్మ, అత్త పాత్రలు ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.పలు సినిమాలకు ఆమె ఉత్తమ నటిగా అవార్డులను సైతం అందుకున్నారు.
అయితే నదియా వల్ల ఒక నిర్మాతకు ఏకంగా 4 లక్షల రూపాయల ఖర్చు తగ్గింది.ముంబైలో చదువుకున్న ఈ నటి సినిమాలలో ఆఫర్లు రావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
హీరోయిన్ గా మోహన్ లాల్ సినిమాతో సక్సెస్ సాధించిన ఈ నటి స్టార్ హీరోల కంటే కథాబలం ఉన్న పాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమాలలో కొదమ సింహం ఒకటనే సంగతి తెలిసిందే.
నదియా అమెరికాలో ఉన్న సమయంలో ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.చిరంజీవికి జోడీగా అంటే మంచి ఛాన్స్ అని అయితే రెండు నెలలు మాత్రమే తాను ఇండియాలో ఉంటానని నదియా షరతు పెట్టారు.ఆ షరతు వల్ల షూటింగ్ కు ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నిర్మాత ఆమెకు బదులుగా బాలీవుడ్ నటి సోనమ్ ను ఎంపిక చేశారు.నదియాను ఎంపిక చేసి ఉంటే నిర్మాతకు 4 లక్షల రూపాయల భారం పెరిగేదని సమాచారం.