ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో నేరుగా చేస్తూనే ఉన్నాం.రోజు రోజు కి ఎన్నో కేసులు, ఎన్నో మరణాలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.
అన్ని రంగాలు మూతపడ్డాయి.ఇక సీని ఇండస్ట్రీ లు కూడా మూతపడటం తో సెలబ్రిటీస్ ఇంట్లో ఉంటూ తమకంటూ సహాయం తో ముందుకు వస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పరిస్థితుల గురించి కొన్ని విషయాలు పంచుకుంది తమన్నా.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పరిచయం గురించి అందరికి తెలిసిందే.
ఇక ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో సెలెబ్రేటీలు నిరుపేదలకు, అనాధలకు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు.ఇక ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.
కానీ కొందరు సెలెబ్రేటీలు తాము చేసే సహాయం గురించి బైటికి చెప్పొకోట్లేదు.ఈ నేపథ్యంలో నెటిజనులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీ లో ఉండి కూడా ఎటువంటి సహాయానికి ముందుకు రావట్లేదు అని మండిపడుతున్నారు.ఇక ఈ విషయం గురించి తాజాగా తమన్నా తన మనసులో మాటలు బైటికి తెలిపింది.
సీని రంగానికి చెందిన వాళ్లు తమ వంతు సేవ కార్యక్రమాలు చేయట్లేదని కొన్ని అపోహలు సృష్టిస్తున్నారని తెలిపింది.కానీ ఈ విషయం లో ఎటువంటి వాస్తవం లేదు అంటూ నిజానికి చాలా మంది ప్రచారాలకు దూరం గా ఉంటూ సేవ కార్యక్రమం లో పాల్గొంటున్నారని తెలిపింది.చేసిన సహాయం గురించి చెప్పుకోవడం లో తప్పు లేదని, దీని వల్ల మరికొందరు స్ఫూర్తి పొంది మరింత సహాయం చేయడానికి ముందుకు వస్తారని తెలిపింది.
ఇక తను వ్యక్తిగతంగా చారిటీ అంశాల్లో ప్రచారాలకు దూరంగా ఉంటానని తెలిపింది.తాను చేసిన సహాయం గురించి ఎక్కడ చెప్పనని,తనకు పబ్లిసిటీ చేసే అవసరం లేదని చెప్పుకొచ్చింది.ఇక సినీ తారలకు అపారమైన సంపద ఉంటుందని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా విలాసవంతంగా ఉంటారనే అపోహలు తొలగాలనే అవసరం ఉందని తెలిపింది.
అంతేకాకుండా సినిమా వాళ్లకు డబ్బులు సులువుగా రావంటూ అందరిలాగానే కష్టపడాలని తెర పై తమకున్న ఇమేజ్ వల్ల ఏదైనా సాధ్యమనే భ్రమలు పెరిగాయని దానివల్ల నటీనటుల పై ప్రతి విషయంలో ఒత్తిడి ఉంటుందని ఈ ధోరణిలో మార్పు రావాలి అంటూ తమన్నా తెలిపింది.