1. అసెంబ్లీకి హాజరు కానీ ఈటెల రాజేందర్
అసెంబ్లీ సమావేశాలకు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరు కాలేదు.
2.ఆర్టీసీపై కేంద్రం కామెంట్స్… కెసిఆర్ ఆగ్రహం
కేంద్రం సూచనలు చేస్తూందని ఆర్టీసీని అమ్మితే వెయ్యి కోట్ల బహుమతి ఇస్తామంటున్నారని కేంద్రం చేస్తున్న ప్రచారం పై కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
3.హైదరాబాద్ నుంచి బాగ్దాద్ కు విమాన సర్వీసు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బాగ్దాద్ కు కొత్త విమాన సర్వీసు ప్రారంభం అయ్యింది.
4.డివో పిటి ఢిల్లీ హై కోర్ట్ సీరియస్
తెలంగాణ ఏఎస్ అధికారి రజత్ కుమార్ పై అవినీతి ఆరోపణలపై డిఓపిటి వైఖరి పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
5.జగన్ పై రేణుకా చౌదరి విమర్శలు
ఏపీలో జగన్ ది మూర్ఖపు పాలనని మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి విమర్శలు చేశారు.
6.అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభం
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టనున్న పాదయాత్ర ఈరోజు ప్రారంభమైంది.
7.సుంకేసుల ప్రాజెక్ట్ 13 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో ప్రాజెక్టుకు ఉన్న 13 గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
8.మాంసం షాపులపై విజిలెన్స్ దాడులు
అనంతపురం పట్టణంలోని 17 మాంసం షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
9.ఎన్నికల కోసమే షాదీ తోప
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నే వైఎస్సార్ షాది తొపా కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది.
10. డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు
ఏపీలో ఖాళీగా ఉన్న డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి పోలా భాస్కర్ తెలిపారు.
11.పాదయాత్రకు లోకేష్ సంఘీభావం
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి పరిసర ప్రాంత రైతులు చేపట్టిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం తెలిపారు.
12.వరల్డ్ డైరీ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని
వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
13.జగ్గారెడ్డి కామెంట్స్
రాహుల్ వేసుకున్న టీ షర్ట్ పైన విమర్శలు చేస్తున్నారంటే, అది బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
14.బట్టి విక్రమార్క సీరియస్
ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు.తెలంగాణకు కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చిందని అవి ఏవి నెరవేరలేదని, దేశాన్ని బిజెపి అమ్మకానికి పెట్టిందని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.
15.జగన్ పై సిపిఐ నారాయణ కామెంట్స్
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని గతంలో వైసిపి అధినేత జగన్ హామీ ఇచ్చారని కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గుణం మారిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
16.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 5,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.జగన్ పై కాంగ్రెస్ విమర్శలు
రాజధానిగా అమరావతినిగా అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించిన సమయంలో కొట్టిన జగన్ ఇప్పుడు రాజధానిగా అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు.
18.నేడు ప్రారంభమైన సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి చేపట్టిన నాలుగో విడత ప్రజా యాత్ర కు విశేష స్పందన లభించింది.
19.కుప్పం పర్యటనలో జగన్
ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటన ఖరారు అయ్యింది.ఈ నెల 22 న కుప్పంలో జగన్ పర్యటించనున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,400 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,660
.