గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.? అనే విషయంపై అనేక అనేక తర్జన భర్జనలు జరిగాయి.అనంతపురం అని కాసేపు… శ్రీకాకుళం అని కాసేపు… ఉభయగోదావరి జిల్లాలని కాసేపు అనేక ఉగిసలాటలు జరిగాయి.అయితే… తూర్పు గోదావరి జిల్లా నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు.
ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా గోపాల కృష్ణ చెప్పారు.పవన్ ఇక్కడ నుంచి పోటీచేయడం తమకు గర్వకారణం అవుతుందని అన్నారు.తూర్పు సెంటిమెంట్తో పవన్ జిల్లాలోని కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏదైనా ఒక అసెంబ్లీలో పోటీకి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.