కరోనా కారణంగా ఫిబ్రవరి వరకే సినిమాలు విడుదల అయ్యాయి.మార్చిలో పరీక్షల సీజన్ అని విడుదల కు ఏ ఒక్కరు ముందుకు రాలేదు.
రెండవ వారం నుండే కరోనా భయంతో థియేటర్లను మూత వేస్తూ వచ్చారు.మొత్తంగా ఈ 12 నెలల్లో కేవలం రెండు నెలలు మాత్రమే థియేటర్లు నడిచాయి.
థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో ఏది బెటర్ అంటే ఉన్నవే కొన్ని కనుక చాలా మంది ఠక్కున చెప్పేస్తున్నారు.పెద్ద హీరోల సినిమాల్లో అల వైకుంఠపురంలో సినిమా టాప్ లో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమాకు సంబంధించిన రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.పాటలు, కలెక్షన్స్, శాటిలైట్ ఇలా అన్ని విధాలుగా అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ను దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.
సరిలేరు నీకెవ్వరు సినిమాతో గట్టి పోటీ ని ఎదుర్కొన్న అల వైకుంఠపురంలో సినిమా చివరకు గెలిచింది.
ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానే కాకుండా ఆల్ టైం రికార్డును కూడా దక్కించుకుంది.బన్నీ కెరీర్ లో ఈ ఏడాది నిలిచి పోతుంది.ఇక చిన్న సినిమాల్లో విజేత ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ‘పలాస 1978’ అంటూ ముక్త కంఠంతో చెబుతున్నారు.కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు సంబంధించిన వసూళ్లు మరియు ఇతర విషయాలు కూడా ఆ సినిమా స్థాయిని నిరూపిస్తున్నాయి.
ఇక ఓటీటీలో విడుదల అయిన సినిమాల విషయంకు వస్తే ఆకాశమే నీ హద్దురా విజేతగా నిలిచింది.ఇంకా కొన్ఇ సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకున్నాయి.కాని నెం.1 మాత్రం ఆ డబ్బింగ్ సినిమాదే అనడంలో సందేహం లేదు.తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించిన సూరారై పోట్రుకు డబ్బింగ్ ఆకాశమే నీ హద్దు.ఈ మూడు సినిమాలు ఈ ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయ్యాయి అనడంలో సందేహం లేదు.