ముంబై వేదికగా మహిళల ఐపీఎల్ నేడే ప్రారంభం కానుంది.ముంబై నగరంలోని బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో ఐదు జట్లు 22 మ్యాచ్లతో 18 రోజులు పోటీ పడనున్నాయి.2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ జరిగిన 15 సీజన్లలో మంచి విజయం కొనసాగించింది.ఇందులో భాగంగానే మహిళలకు కూడా వరల్డ్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొని ముంబై నగరం వేదికగా డబ్ల్యూపిఎల్ జరగనుంది.
ఈరోజు రాత్రి 7 గంటలకు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా బీసీసీఐ ఆరంభ వేడుకల్ని నిర్వహించనుంది.ప్రముఖ బాలీవుడ్ స్టార్లు ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారు.
![Telugu Mumbai, Smriti Mandanna, Ipl, Premier League-Sports News క్రీడ� Telugu Mumbai, Smriti Mandanna, Ipl, Premier League-Sports News క్రీడ�](https://telugustop.com/wp-content/uploads/2023/03/women-premier-league-2023-starts-today-at-mumbai-dy-patil-stadium-detailsd.jpg)
డబ్ల్యూపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నారు.బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ గా ఓపెనర్ స్మృతి మందన వేలంలో అధికంగా 3.40 కోట్లు పలకడం జరిగింది.ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ వేలంలో 1.80 కోట్లు పలకడం జరిగింది.
![Telugu Mumbai, Smriti Mandanna, Ipl, Premier League-Sports News క్రీడ� Telugu Mumbai, Smriti Mandanna, Ipl, Premier League-Sports News క్రీడ�](https://telugustop.com/wp-content/uploads/2023/03/women-premier-league-2023-starts-today-at-mumbai-dy-patil-stadium-detailsa.jpg)
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్ కు బెత్ మూనీ, యూపీ వారియర్స్ కు ఆస్ట్రేలియా బ్యాటర్ వికెట్ కీపర్ అలీసా హేలీ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.డీవై పాటిల్ స్టేడియం వేదికగా మార్చి 24 సెమీఫైనల్, మార్చి 26 ఫైనల్ సమరం జరగనుంది.పురుషుల క్రికెట్లో, మహిళల క్రికెట్లో కాస్త వ్యత్యాసం ఉంది.
స్టేడియం ను బట్టి పురుషుల క్రికెట్ బౌండరీ లైన్ 70 నుండి 80 మీటర్ల దూరంలో ఉంటుంది.అదే మహిళల క్రికెట్లో బౌండరీ లైన్ 50 మీటర్ల దూరంలో ఉంటుంది.
పురుషుల ఐపీఎల్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సాగితే, మహిళల ఐపీఎల్ గంటకు 30 కిలోమీటర్ల వేగంతో సాగుతుంది.