హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపుతోంది.తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే మారెమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.