సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకు చేయాల్సిన సినిమాని వివిధ కారణాలతో మరో హీరో చేయటం సూపర్ హిట్ అందుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాల విషయంలో ఇలా జరిగింది.
అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిందట.ముందుగా భీమ్లా నాయక్ సినిమాని పవన్ కళ్యాణ్ తో తీయాలని అనుకోలేదట.
పవన్ కంటే ముందే మరికొంతమంది పలువురు హీరోలను సంప్రదించినట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భీమ్లా నాయక్ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయినా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది.అయితే ముందుగా ఈ సినిమాని వెంకటేష్ రానా కాంబినేషన్ లో తీయాలని అనుకున్నారట నిర్మాతలు.
కానీ ఎందుకో వీరి కాంబినేషన్ సెట్ కాలేదు.ఆ తర్వాత బాలయ్య రవితేజ కాంబినేషన్లో ఈ సినిమా తీస్తే బాగుంటుందని మరో ఆలోచన కూడా చేశారట.
ఇక ఈ కాంబినేషన్ కూడా పలు కారణాల వల్ల సెట్ కాలేకపోయింది.ఇక ఓ రోజు నాగ వంశీ సోషల్ మీడియాలో అయ్యప్పన్ కోషియుమ్ సినిమా చూసి వెంటనే త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ఈ సినిమా చేద్దాం చాలా బాగుంది అని చెప్పాడట.
తర్వాత సినిమా చూసిన త్రివిక్రమ్ వెంటనే రీమేక్ రైట్స్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని అప్పుడే చెప్పేశాడట.పవన్ కళ్యాణ్కు స్క్రిప్టుని చెప్పడం ఆ తర్వాత పవన్ కి స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పాడు.అయితే ఇక మలయాళంలో పృథ్విరాజ్ పోషించిన క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందా అని సందిగ్ధంలో ఉన్న సమయంలో రవితేజను తీసుకోవాలని అనుకున్నారట.కానీ రవితేజ వరుసగా షూటింగ్లతో బిజీగా ఉండడంతో ఇక్కడ రానాని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఎంత బ్లాక్బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.