విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ను( CM Jagan ) కేశినేని నాని కలవనున్నారు.
ఇటీవలే కేశినేని నాని కుమార్తె శ్వేతా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఆయన తన ఎంపీ పదవికి ఫిబ్రవరిలో రాజీనామా చేస్తానని వెల్లడించారు.తాజాగా సీఎం జగన్ తో ఆయన భేటీకానుండటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఒకవేళ కేశినేని నాని వైసీపీ( YCP ) కండువా కప్పుకుంటే రానున్న ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.